ప్రయాణికుడి పై ఆర్టీసీ డ్రైవర్ చేయి చేసుకున్న సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మేడ్చల్ డిపో కి చెందిన బస్సు కోసం ప్రయాణికుడు రాజలింగం రామాయంపేట వెళ్లడానికి ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే మేడ్చల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రామయంపేట్ వెళ్తుండడం తో ప్రయాణికుడు చెయ్యెత్తి బస్సు ను ఆపాడు. బస్సు డ్రైవర్ ఆపకపోవడంతో ఆగ్రహంతో ప్రయాణికుడు తిట్టడంతో బస్సు డ్రైవర్ పక్కకు ఆపి రాజలింగం తలపై కర్రతో దాడి చేశాడు.