పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఎల్లప్పుడూ అందేలా చూస్తామని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అన్నారు. సోమవారం సీతాఫల్మండిలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 82 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.