
వెస్ట్ మారేడ్ పల్లి: సంక్షేమ పథకాలతో లబ్ధి పొందాలి: తలసాని
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని లబ్ధిపొందాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన కార్యాలయంలో అమీర్పేట మండల పరిధిలోని అమీర్పేట, సనత్ నగర్ డివిజన్లకు చెందిన ఆరుగురు లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆడపడుచు పెళ్లికి ఆర్థిక సాయంగా ఈ పథకం ఉపయోగపడుతుందని అన్నారు.