చెక్కులు పంపిణీ చేసిన డిప్యూటీ మేయర్

57చూసినవారు
చెక్కులు పంపిణీ చేసిన డిప్యూటీ మేయర్
సికింద్రాబాద్ జంట నగరాల్లో నిర్వహించే ఆషాడ మాస బోనాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసిందని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శోభన్ రెడ్డి అన్నారు. సీతాఫల్మండి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ఆలయ కమిటీ సభ్యులకు బోనాల జాతర నిర్వహణ కోసం మంగళవారం చెక్కులు పంపిణీ చేశారు. గతేడాది కంటే ఈసారి ఎక్కువ నిధులు కేటాయించామని, ఆలయాల వద్ద ఘనంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్