తాను రుణమాఫీ చేసిన మరుక్షణమే కేసీఆర్ BRSను రద్దు చేస్తారా? అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మద్దూరులో సీఎం మాట్లాడుతూ.. ఏ రైతు అధైర్య పడాల్సిన అవసరం లేదని.. రుణమాఫీ చేసే బాధ్యత తనదని అన్నారు. రైతులను బ్యాంకులు ఇబ్బంది పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. అందరూ వరి వేయండి.. చివరి గింజ వరకు కొంటామని ఆనాడు కేసీఆర్ అన్నారని.. వరి వేశాక ధాన్యం కొనకుండా రైతులను ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు.