కాంగ్రెస్ ప్రభుత్వంలో బల్మూరి వెంకట్, తీన్మార్ మల్లన్నకు ఉద్యోగాలు వచ్చాయని.. ధర్నాలు చేస్తున్న గ్రూప్స్ అభ్యర్థులకు మాత్రం రాలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఎద్దేవా చేశారు. గాంధీ ఆసుపత్రిలో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు మోతీలాల్ను ఆయన పరామర్శించి మాట్లాడారు. ప్రజా పాలనలో విద్యార్థులు, నిరుద్యోగులు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని విమర్శించారు.