దండకారణ్యంపై దండయాత్ర

58చూసినవారు
దండకారణ్యంపై దండయాత్ర
ఇన్నాళ్లు మావోయిస్టులకు కోటగా ఉన్న ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంపై భద్రతా బలగాలు దండయాత్ర చేస్తున్నాయి. గత 4 నెలల్లో ఈ ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి భారీ నష్టం వాటిల్లింది. వివిధ ఎన్ కౌంటర్లలో 91 మంది నక్సలైట్లు మరణించగా.. 205 మంది అరెస్ట్ అయ్యారు. మరో 231 మంది లొంగిపోయారు. దీంతో మావోయిస్టు కేంద్ర కమిటీ సురక్షిత స్థావరాల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.