స్ట్రీట్ ఫుడ్ ‘పానీ పూరి’ అమ్మేవారు సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా విక్రయిస్తుండడంతో అనేక వ్యాధులకు కారణమవుతోంది. దీంతో డయేరియా, టైఫాయిడ్, జాండిస్ వంటి వ్యాధులకు గురవుతున్నారు. కర్ణాటకలో 250 పానీపూరీ నమూనాలను సేకరించారు. మొత్తం నమూనాలో 40 ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని వెల్లడైంది. దీంట్లో బ్రిలియంట్ బ్లూ, టార్ట్రాజైన్ వంటి రసాయనాలు కనుగొన్నారు. వీటిలో క్యాన్సర్ కలిగించే పదార్థాల గురించి ఆందోళనలు నెలకొన్నాయి.