ఐపీఎల్ మ్యాచుల్లో వైడ్లు, నోబాల్స్కు సమీక్ష కోరే నిబంధనను గతేడాది ప్రవేశపెట్టారు. ఈ రూల్తో కీలక సమయాల్లో జట్లు లబ్ధి పొందాయి. దీంతో ఈసారి కూడా ఈ నిబంధన కొనసాగించనున్నారు. దీనికితోడు ప్రతీ జట్టుకు అదనంగా రెండు రివ్యూలు అందుబాటులో ఉంటాయి. ఇక రేపు రాత్రి 8 గంటలకు జరిగే తొలి మ్యాచ్లో CSK-RCB తలపడనున్నాయి. CSK కొత్త కెప్టెన్గా రుతురాజ్ను నియమించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.