గాజాలో మసీదుపై ఇజ్రాయెల్ దాడి.. 24 మంది దుర్మరణం (వీడియో)

58చూసినవారు
హెజ్‌బొల్లా అంతం లక్ష్యంగా ఇజ్రాయెల్ ఇటీవల దాడులను మరింత ముమ్మరం చేసింది. ఆదివారం తెల్లవారుజామున సెంట్రల్ గాజాలోని ఓ మసీదుపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో 24 మంది మరణించారు. ఈ మేరకు పాలస్తీనా వైద్య అధికారులు వెల్లడించారు. మృతులంతా పురుషులేనని తెలిపారు. డెయిర్ అల్-బలాహ్ పట్టణంలోని అల్-అక్సా అమరవీరుల ఆసుపత్రికి సమీపంలో ఉన్న ఈ మసీదులో నిరాశ్రయులైన జనం ఉంటున్నారు. అయితే ఈ దాడిపై ఇజ్రాయెల్‌ ఎలాంటి ప్రకటన చేయలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్