రేపు ప్రతి ఇంట్లో 5 దీపాలు వెలిగించాలి

16825చూసినవారు
రేపు ప్రతి ఇంట్లో 5 దీపాలు వెలిగించాలి
అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా సోమవారం ప్రతి ఇంట్లో 5 దీపాలు వెలిగించాలని బాన్సువాడ శ్రీరామ తీర్థ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. సోమవారం ఉదయం ప్రతి ఒక్కరు శ్రీరాముని గుడిలో లేదా ఇంట్లో రాముని చిత్రపటం ముందు నిష్టతో, భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి సాయంత్రం ఇంట్లో 5 దీపాలు వెలిగించి శ్రీరాముని అక్షింతలు తలపై చల్లుకోవాలని సూచించారు. పండగ వాతావరణంతో వీధులన్నీ శ్రీరామానామ స్మరణతో మార్మోగాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్