నిరుపేద కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందజేత

68చూసినవారు
పోతంగల్ మండలంలో నిరుపేద కుటుంబాలకు మాజీ కో ఆప్షన్ సభ్యుడు ఎంఏ హకీం ఆర్థికంగా చేయూతనిచ్చారు. మండలంలోని జల్లపల్లి ఫారంలో ఐశ్వర్య అనే అమ్మాయి కడుపు నొప్పితో మరణించడంతో వారి కుటుంబానికి బుధవారం ఆర్థిక సాయం అందించారు. అనంతరం పాత పోతంగల్ లో బోయి లక్ష్మి ద్విచక్ర వాహనంపై అకస్మాత్తుగా కిందిపడి మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్