పురాతన ఇళ్లను పరిశీలించిన పంచాయతీ కార్యదర్శి

52చూసినవారు
పురాతన ఇళ్లను పరిశీలించిన పంచాయతీ కార్యదర్శి
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని వీరాపూర్ గ్రామంలో పురాతన ఇళ్లను పంచాయతీ కార్యదర్శి హరీష్ కుమార్ సోమవారం పరిశీలించారు. గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కూలిన ఇండ్లను పరిశీలించి తాత్కాలిక శిబిరాలకు వెళ్లాలని పలువురికి సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి హరీష్ కుమార్, మాజీ సర్పంచ్ ఎర్రోళ్ల సాయిరాం, మిర్జాపూర్ పాక్స్ చైర్మన్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్