పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కోఆర్డినేటర్ దామోదర్ రెడ్డి శుక్రవారం బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన టిపిసిసి డెలిగేట్ బొప్పిడి వెంకట్రాంరెడ్డిని జయరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ న్యాయ పరిశీలకుడుగా నియమించినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ డెలిగేట్ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేస్తానన్నారు.