జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పై బిజెపి జెండా ఎగరవేయడం ఖాయమని పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్, ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం నిజం సాగర్ మండలంలో బిజెపి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు అరుణతార, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.