పిట్లం మండలం చిల్లర్గి గ్రామంలోని హెల్త్ సెంటర్ ను బుధవారం ఎంపీడీవో కమలాకర్ సందర్శించారు. ఎండాకాలం సందర్భంగా ఎండలు విపరీతంగా ఉన్నందున ఓ ఆర్ ఎస్ పాకెట్లను అందుబాటులో ఉంచుకొని ఎప్పటికప్పుడు ప్రజలకు సరఫరా చేయాలని హెల్త్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ కే బ్రహ్మం, హెల్త్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.