అపరిశుభ్రత గురించి నిలదీసిన యూత్ సభ్యులు
బీర్పూర్ మండల కేంద్రంలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం ఆవరణలో గల కోనేరులో కప్పలు చనిపోయి నీటిలో చెత్త చెదారం పేరుకుపోయింది. ఈ విషయమై యువ చైతన్య యూత్ సభ్యులు సోమవారం గుడి ఆవరణ, కోనేరుని పరిశీలించి అధికారులను నిలదీశారు. వాటర్ ట్యాంక్ లో సైతం నీరు రావడం లేదని అన్నారు. రెండు మూడు రోజుల్లో సమస్య ఇలాగే ఉంటే పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని యూత్ సభ్యులు తెలిపారు.