ఇంట్లో ఎగిసిపడ్డ మంటలు.. నిద్రలోనే నలుగురు సజీవ దహనం (వీడియో)

50చూసినవారు
హర్యానాలో ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్నవేళ ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏం జరుగుతుందో అర్ధమయ్యేలోపే ఇంట్లోని నలుగురు ఆ మంటల్లో సజీవ దహనమయ్యారు. హర్యానా రాష్ట్రం గుర్గావ్ నగరంలో గల సరస్వతి ఎన్‌క్లేవ్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఇంట్లో మంటలు ఎగిసిపడటంతో చుట్టుపక్కల వాళ్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సంబంధిత పోస్ట్