మహిళపై దాడి చేసిన వ్యక్తిపై కేసు
కూతురికి మంత్రాలు చేస్తుందని అనుమానంతో ఓ మహిళపై దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ASJ రవీందర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బీర్పూర్ మండలం తుంగూరుకు చెందిన మహిళపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి తన కూతురు అనారోగ్యానికి మంత్రాలు చేయడమే కారణమని ఇంట్లో చొరబడి దాడి చేసి చంపుతానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వివరించారు