పోలీసు శాఖ ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమం

75చూసినవారు
ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి సీఐ కృష్ణ, ధర్మారం ఎస్సై శీలం లక్ష్మణ్ మాట్లాడుతూ. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. గంజాయి లాంటి మత్తు పదార్థాలకు ఎవరూ బానిస కావద్దని, గంజాయి వినియోగించినా, సరఫరా చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్