హుజురాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట పత్తి మార్కెట్లో పత్తి ధర నిలకడగానే కొనసాగుతుంది. మంగళవారం మార్కెట్ కు రైతులు 12 వాహనాల్లో 184 క్వింటాల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా. గరిష్ఠంగా రూ. 7, 500, కనిష్ఠంగా రూ. 7, 200 పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు. పత్తి ధరలు పెరగకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. మార్కెట్లో కొనుగోలు పక్రియ జోరుగా సాగుతుంది.