
కరీంనగర్: దొంగతనానికి పాల్పడిన ఇద్దరు కిలేడీలు అరెస్టు
హుజురాబాద్ పట్టణంలోని మంజునాథ జువెలరీ షాప్లో ఈ నెల 25న దొంగతనానికి పాల్పడిన ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినట్లు హుజురాబాద్ టౌన్ సిఐ జి తిరుమల్ గౌడ్ తెలిపారు. జువెలరీ షాప్లోని సిసి కెమెరాల ఫుటేజి ఆధారంగా నిందితులను గుర్తించి బస్టాండ్ సమీపంలో వారిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. నిందితుల నుండి వెండి పట్టిలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.