హుజురాబాద్ లో గావ్ చలో కార్యక్రమం

1560చూసినవారు
హుజురాబాద్ పట్టణ కేంద్రంలో గావ్ చలో కార్యక్రమంలో భాగంగా మంగళవారం బిజెపి పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు వీధిలో తిరుగుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుందో తెలియజేశారు. ఉజ్వల పథకం, ఫసల్ బీమా పథకం, ఎరువులపై సబ్సిడీ పలు పథకాలను ప్రజలకు వివరించినట్లు తెలిపారు. బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్