శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్

557చూసినవారు
శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంటలో శ్రీరామనవమి వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ, గతంలో తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు స్వామివారిని దర్శించుకున్నానని, ఇక్కడ పలు కార్యక్రమాలు ప్రారంభించినట్లు చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇల్లంతకుంట ఆలయంలోని వేడుకలను రాష్ట్ర స్థాయి వేడుకలుగా గుర్తిస్తామన్నారు.

ట్యాగ్స్ :