రాయికల్ పట్టణంలోని శ్రీ భీమేశ్వర స్వామి వారి రథోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ భీమేశ్వర స్వామి రథాన్ని లాగేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఈ జాతర మహోత్సవానికి మండలంతో పాటు జగిత్యాల, కోరుట్ల, ఖానాపూర్, నిర్మల్, మల్లాపూర్, మేడిపల్లి మండలాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.