పార్టీ ఫిరాయించిన ఎనిమింది మంది MLAలపై అనర్హత వేటు వేస్తూ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. TDP పిటిషన్తో.. ఆ పార్టీని వీడిన మద్దాల గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్లపై అనర్హత వేటు వేశారు. అలాగే YCP పిటిషన్తో.. ఆ పార్టీని వీడిన ఆనం రామనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలపై అనర్హత వేటు వేశారు.