సన్నరకం వారి ధాన్యం రూ. 2,500 కింటాల్ చొప్పున కొనుగోలు చేయాలని రాస్తారోకో

552చూసినవారు
సన్నరకం వారి ధాన్యం రూ. 2,500  కింటాల్ చొప్పున కొనుగోలు చేయాలని రాస్తారోకో
సన్న రకం వరి ధాన్యం క్వింటాల్ కి రూ. 2,500 చొప్పున కొనుగోలు చేయాల నీ కోరుతూ సోమవారం కరీంనగర్ రూరల్ మండలం నంగునూరు వద్ద చొప్పదండి కరీంనగర్ రహదారిపై రైతులు, భాజపా శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సంతోష్ కుమార్ మాట్లాడుతూ సన్నరకం వారి ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది కి గురి చేయొద్దని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులతో పాటు ఎంపీటీసీలు, భాజపా శ్రేణులు మహేందర్ రెడ్డి, మునిగంటి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :