కారు ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు.

52చూసినవారు
కారు ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు.
శంకరపట్నం మండలం కొత్తగట్టు చెందిన పల్లె రజితకు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా హుజురాబాద్ వైపు వెళ్లే కారు ఢీకొనడంతో రజిత తీవ్రంగా గాయపడింది. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది ఈఎంటి సతీష్, పైలెట్ గోపికృష్ణ అపస్మారక స్థితిలో ఉన్న రజితకు ప్రధమ చికిత్స అందిస్తూ అంబులెన్స్ లో హుజురాబాద్ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్