కేశవపట్నంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం
శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గెలుపే ధ్యేయంగా ప్రతి గడపగడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ చేయి గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకుడు పిట్టల సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.