గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట యువతి హాల్ చల్

2539చూసినవారు
శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఓ యువతి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పంచాయతీ సెక్రటరీ ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వట్లేదని శివకుమారి అనే యువతి పెట్రోల్ పోసుకుంది. ఐదు నెలలుగా ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం అధికారులు చుట్టూ తిరుగుతూ అలసిపోయానని ఆమె వాపోయింది. ఈ క్రమంలో పంచాయతీ కార్యదర్శి మమతతో వాగ్వాదానికి దిగింది. స్థానికులు అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.

ట్యాగ్స్ :