ప్రజా సమస్యలపై ఎమ్మార్వోకి వినతి పత్రం: సిపిఎం

80చూసినవారు
ప్రజా సమస్యలపై ఎమ్మార్వోకి వినతి పత్రం: సిపిఎం
సిపిఎం రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు శంకరపట్నం మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మార్వో జోగినపల్లి అనుపమకు మండల ప్రజల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. గృహలక్ష్మి, గృహ జ్యోతి పథకాల ద్వారా మహిళలకు రూ. 2500, అర్హులైన మహిళలకు ఇల్లు, రైతులకు రైతు భరోసా కింద రూ. 7500 పెట్టుబడి సాయం రైతుల అకౌంట్లో వేసి ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్