జర్నలిస్టులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి

78చూసినవారు
జర్నలిస్టులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి
ఆర్టీసీ బస్సుల్లో జర్నలిస్టులందరికీ ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించాలని టియుడబ్ల్యూజే- ఐజేయు రాష్ట్ర ఉపాధ్యక్షులు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బుర్ర సంపత్ కుమార్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను కోరారు. శుక్రవారం కాల్వ శ్రీరాంపూర్ లో మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాలె శివప్రసాద్, సోన్నాయి టెంకం చంద్రమౌళి, రావి కోటేశ్వర్, మృత్యుంజయం, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్