రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి

80చూసినవారు
రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి
రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రత్యూష తెలిపారు. సోమవారం జూలపల్లిలో భూసార పరీక్షలపై అవగాహన కల్పించారు. రైతులకు ఉచితంగా భూసార పరీక్షలు చేస్తారని తెలిపారు. మట్టి నమూనాలను పరీక్షించిన తర్వాత ఎరువులు ఎంత మోతాదులో వేసుకోవాలో తెలుస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ రాకేశ్, రైతులు రాంరెడ్డి, కళ్లెం దామోదర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్