రోడ్లపై నిలిచిన వర్షపు నీరు.. ఇబ్బందుల్లో వాహనదారులు

70చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి, కోరుట్ల బస్టాండ్ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు సరిగా లేకపోవడంతో రోడ్లపై వర్షపు నీరు చేరింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని రోడ్లు బాగుచేయించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్