క్యాండిల్‌ ర్యాలీని ప్రారంభించిన కేసీఆర్

73చూసినవారు
క్యాండిల్‌ ర్యాలీని ప్రారంభించిన కేసీఆర్
BRS ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌ గన్‌పార్క్‌ వద్దకు చేరుకున్నపార్టీ అధినేత కేసీఆర్‌ క్యాండిల్‌ ర్యాలీని ప్రారంభించారు. గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం నుంచి సచివాలయం ఎదురుగా ఉన్న అమరజ్యోతి వరకు క్యాండిల్‌ ర్యాలీ కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి కేటీఆర్‌తోపాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు హాజరయ్యారు.