'నీటి ఎద్దడికి కేజ్రీవాల్‌ సర్కార్‌ బాధ్యత వహించాలి'

58చూసినవారు
'నీటి ఎద్దడికి కేజ్రీవాల్‌ సర్కార్‌ బాధ్యత వహించాలి'
నీటి ఎద్దడితో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర విమర్శలతో కాలం గడుపుతున్నాయని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేంద్ర యాదవ్ ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్‌ ప్రభుత్వం ఢిల్లీకి నీటిని విడుదల చేసిందని చెప్పారు. ఢిల్లీలో నీటి లీకేజీ ఎక్కువగా ఉందని, ఈ సమస్యకు కేజ్రీవాల్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. నీటి ఎద్దడిపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్