ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేయలేదని, తనంతట తానుగానే అరెస్ట్ అయ్యారంటూ అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. లిక్కర్ స్కాంలో ఈడీ పంపిన తొమ్మిది సమన్లకు స్పందిచకపోవడమే ఆయన అరెస్టుకు కారణమని చెప్పారు. ఇదంతా రాజకీయ సానుభూతిని పొందే వ్యూహంలో భాగమని అనుమానం వ్యక్తం చేశారు. ఈడీ సమన్లకు రాహుల్గాంధీ, సోనియాగాంధీ కూడా హాజరయ్యారని ఆయన గుర్తుచేశారు.