మధిరలో బైక్ ర్యాలీ నిర్వహించిన బిజెపి నాయకులు
![మధిరలో బైక్ ర్యాలీ నిర్వహించిన బిజెపి నాయకులు](https://media.getlokalapp.com/cache/c6/e3/c6e39b17b7748f991b673497fdcf17f6.webp)
భారతదేశంలో మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మండల భారతీయ జనతా పార్టీ నాయకులు ఆదివారం మధిర పట్టణంలోని పలు ప్రాంతాలలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు ప్రధాన కూడళ్ళ వద్ద బాణాసంచా కాల్చి స్థానిక ప్రజలకు స్వీట్స్ పంచిపెట్టారు.