పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం తిరుమలాయపాలెం మండలం సుబ్లేడ్, హస్నాబాద్, బచ్చోడు, జూపేడ, రాజారం, పైనంపల్లి, సోలిపురం గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించి దిశానిర్ధేశం చేశారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపుకు కృషి చేయాలని కోరారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.