రహదారి నిర్మించాలని గాంధీ వేషధారణతో నిరసన ర్యాలీ

75చూసినవారు
ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురంలోని న్యూ శుక్ల పాఠశాలకు వెళ్లే రహదారి గుంతలమయంగా తయారైందని సామాజిక కార్యకర్త ఎదురుగట్ల చిట్టిమల్లు అన్నారు. మంగళవారం మహాత్మా గాంధీ వేషధారణతో స్థానిక విద్యార్థులతో కలిసి నిరసన ర్యాలీ చేపట్టారు. గుంతలమయంగా తయారైన రహదారి వల్ల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారి నిర్మాణం చేపట్టాలని కోరారు.
Job Suitcase

Jobs near you