తిరుమలాయపాలెం: అక్రమ కేసులకు భయపడేది లేదు

72చూసినవారు
తిరుమలాయపాలెం: అక్రమ కేసులకు భయపడేది లేదు
బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడితే భయపడేది లేదని. నాయకులు, కార్యకర్తలకు అండగా నిలిచి పోరాడుతామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ వెల్లడించారు. తిరుమలాయపాలెం మండలం జల్లెపల్లికి చెందిన బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భాషబోయిన వీరన్నపై ఇటీవల కేసులు నమోదు కావడంతో బుధవారం ఎమ్మెల్సీ మాట్లాడారు. కాంగ్రెస్ పరిపాలనలో ఇచ్చిన హామీలు సక్రమంగా అమలు చేయకపోవడంతో ప్రజా వ్యతిరేకత పెరిగిందన్నారు.