సత్తుపల్లి మునిసిపాలిటీలో సోమవారం భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో పరిసర ప్రాంతాలలోనే వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా రహదారులన్నీ జలమయమయ్యాయి. కొద్దిరోజులుగా పట్టణంలోని ఆయా ప్రాంతాలలో డ్రైనేజీలలో మురుగునీరు నిలవడంతో వరదనీరు రోడ్లపైనే పారింది. డ్రైనేజీలకు మరమ్మతులు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. కాగా కురిసిన భారీ వర్షంతో పట్టణ ప్రజలు కొంత ఉపశమనం పొందారు.