కామేపల్లి మండల పరిధిలోనే కెప్టెన్ బంజర సమీపంలో ఉన్న మామిళ్ళ చెరువు ఈ ఏసవిలో పూర్తిగా ఎండిపోయింది. ఈ చెరువులో చుక్క నీరు లేకుండా ఎండిపోవడం ఇదే మొదటి సారి అని ఈ ప్రాంత రైతులు శనివారం పేర్కొన్నారు. ఎప్పుడు చెరువులో నీళ్లు ఉండటంతో పుష్కలంగా చెపలు లభించేయవని, ఈ ప్రాంత పరిసర గ్రామాలకు సంబంధించిన పశువులకు తాగేందుకు పుష్కలంగా నీరు లభించేదని తెలిపారు. ఈ చెరువు ఎండిపోవటంతో పశువులకు నీటి కొరత ఏర్పడిందని తెలిపారు.