
కారేపల్లి: పరిమితికి మించి వైద్యం చేయొద్దు
గ్రామీణ వైద్యులు పరిమితికి మించి వైద్యం చేయొద్దని, అత్యవసరమైతే పెద్దాస్పత్రులకు రిఫర్ చేయాలని సీఐ తిరుపతిరెడ్డి అన్నారు. కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి శ్రీకోటమైసమ్మ తల్లి దేవస్థాన ప్రాంగణంలో గ్రామీణ వైద్యుల సహాయక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి మండల 26వ వార్షికోత్సవం నిర్వహించగా సీఐ మాట్లాడారు. గ్రామీణ వైద్యులు ఐక్యంగా ఉండి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వైద్య సేవా కార్యక్రమాలను విస్తరింపజేయాలన్నారు.