కారేపల్లి మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి గ్రామంలో గల కోట మైసమ్మ తల్లి ఆలయంలో పవిత్ర బ్రహ్మోత్సవ కార్యక్రమాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులు పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ నర్సాపట్టాభి రామారావు విజయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వేద పండితుల ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా ప్రారంభించారు.