కేంద్ర మంత్రిగా కిషన్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

59చూసినవారు
కేంద్ర మంత్రిగా కిషన్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరణ
సికింద్రాబాద్ నుంచి వరుసగా రెండో సారి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించారు. ఏపీ భవన్‌లోని వేంకటేశ్వరస్వామి, దుర్గమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కిషన్ రెడ్డితో పాటు మాల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కూడా ఉన్నారు. కాగా కిషన్ రెడ్డి గతంలో టూరిజం కేంద్ర మంత్రిగా, సహాయ మంత్రిగా పని చేశారు.