TG: బీసీ రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని.. అందుకే కులగణనపై విమర్శలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కులగణనలో పాల్గొనాలని కేసీఆర్ను, కేటీఆర్ను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు డిమాండ్ చేయడంలేదని ఆయన నిలదీశారు. కులగణనపై విమర్శలు చేసేవారు.. ఎక్కడ లోపాలు ఉన్నాయో చెప్పాలన్నారు. బీసీలకు అన్యాయం చేయాలనే ఉద్దేశంతోనే కిషన్ రెడ్డి కులగణనపై విమర్శలు చేస్తున్నారన్నారు.