సింహాద్రి ఎక్స్ప్రెస్ రైలు రెండు రోజులు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ డివిజన్ పరిధిలోని కడియం, ద్వారపూడి, అనపర్తి రైల్వే స్టేషన్ల మధ్య నాన్–ఇంటర్ లాకింగ్ పనులు కారణంగా శనివారం నుంచి సోమవారం వరకు రైలు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు.