అట్రాసిటీ కేసులను తక్షణమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్
![అట్రాసిటీ కేసులను తక్షణమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్](https://media.getlokalapp.com/cache/a0/f9/a0f9038c2c9162aa908354fe22e0cd58.webp)
ఎస్సీ, ఎస్టి అట్రాసిటీ కేసులను తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని కొమురంభీం జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్లో ఎస్పి సురేష్ కుమార్ తో కలిసి ఎస్సి, ఎస్టి అట్రాసిటీ, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో అట్రాసిటీ కేసుల పురోగతిపై త్రైమాసిక సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. అధికారులు రాజకీయ ఒత్తిడులకు లోను కాకుండా విచారణ చేపట్టాలని అన్నారు.