![వృద్ధుడి ఆత్మహత్య వృద్ధుడి ఆత్మహత్య](https://media.getlokalapp.com/cache/93/75/9375c8700643a75c437c4ce2082d1499.webp)
వృద్ధుడి ఆత్మహత్య
కొమురంభీం జిల్లా బెజ్జూర్ మండలంలోని కృష్ణ పల్లి గ్రామానికి చెందిన నాయిని గంగయ్య (65) అనే వ్యక్తి గురువారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బెజ్జూర్ ఎస్సై విక్రమ్ వివరాల ప్రకారం.. మృతుడు గత నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని ఆ బాధ భరించలేక ఉదయం 5: 30 గంటల ప్రాంతంలో ఉరివేసుకుని మరణించాడని, మృతుడి భార్య విమల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.